ఏపీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ సరికాదు : తమ్మారెడ్డి భరద్వాజ

Update: 2020-01-04 06:07 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కాన్సెప్ట్ సరికాదన్నారు సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. హైదరాబాద్‌ నుంచి ఉద్యోగులు ఇప్పటికే అమరావతికి షిఫ్ట్ అయ్యారని.. ఇప్పుడు విశాఖపట్నం వెళ్లడం వాళ్లకు కష్టం అవుతుందని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి కానీ.. ఇబ్బంది పెట్టడం సరికాదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

Similar News