సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది. బాధిత కుటుంబం పోరాటం ఫలించింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఈనెల 22 నిర్భయ దోషులకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని పటియాలా కోర్టు ఆదేశించింది.