కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకులు AR రెహ్మాన్ పాల్గొన్నారు. గంధ మహోత్సవానికి హాజరై... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి సైతం వేడుకల్లో పాల్గొన్నారు. వారం రోజుల పాటు వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫకీర్లు, కవ్వాలి ప్రముఖులు హాజరవనున్నారు. మొదటి రోజు వేడుకల్లో జిల్లా నుంచే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.