అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకంటే.. ప్రజల నుంచే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరిస్తున్నారు. భూములు ఇచ్చి రోడ్డున పడ్డ రాజధాని రైతులకు న్యాయం జరగాలన్నారు. కర్నూలుకు హైకోర్టు ఇచ్చి.. మళ్లీ బెంచ్లు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజధానిని మార్చాలని చూస్తే.. గ్రేటర్ రాయలసీమ ఉద్యమం రగులుకుంటుందన్నారు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.