పక్కనే ఉన్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమకు పోరెడ్డిపల్లితండాలో వ్యవసాయ భూములున్నాయి. అయితే అందులోకి వెళ్లేదారి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆ మహిళల భర్తలపై జ్యోతి ఫిర్యాదు చేసింది. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ వారు గ్రామంలోకి వెళ్లి జ్యోతిని స్తంభానికి కట్టేసి కొట్టారు. బాధిత కుటుంబ సభ్యులు డయల్ 100కి కాల్ చేయగా... పోలీసులు వచ్చి జ్యోతిని విడిపించారు.