అమరావతి ఉద్యమం : అనంతపురం జిల్లాలో పర్యటిస్తోన్న చంద్రబాబు

Update: 2020-01-13 04:00 GMT

రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ... అమరావతి పరిక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీలు, బహిరంగ సభలు కొనసాగుతున్నాయి. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురంలో పర్యటిస్తారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు ఆయన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య పెనుగొండలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు..

సాయంత్రం చెన్నేకొత్తపల్లి, మామిళ్లపల్లి, రాప్తాడు మీదు బళ్లారి బైపాస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు నగరంలోని క్లాక్‌ టవర్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. 6.30 గంటలకు నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.

Similar News