వైసీపీ ఎమ్మెల్యేలది జనాల మధ్యకు వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితి: అనిత

Update: 2020-01-13 09:01 GMT

మహిళలపై పోలీసులు అస్త్రాలు ప్రయోగించడం దుర్మార్గమన్నారు టీడీపీ నాయకురాలు అనిత. విజయవాడలో మహిళలు శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే అలజడి సృష్టించే కుట్ర పన్నారని ఆరోపించారు. మహిళలపై కేసులు పెట్టడం దారుణమైన చర్యన్నారు. భయబ్రాంతులకు గురి చేసే ఆలోచన సరికాదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు జనాల మధ్యకు వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారన్నారు. మహిళా కమిషన్‌ సభ్యులను 144 సెక్షన్‌ పేరుతో రాజధానిలో సరిగా తిరిగనివ్వలేదన్నారు.

Similar News