సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే టీఆర్ఎస్ని గెలిపిస్తాయి - మంత్రి పువ్వాడ
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని రోడ్ షోలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతోపాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని పువ్వాడ తెలిపారు. మున్సిపాలిటీలకు అధిక నిధులు ఖర్చు చేసి మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు.