కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి.. . కోకాపేట, తుక్కుగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. బీజేపీకి ఆత్మగౌరవంతో ఓటువేయాలని కోరారు. బీజేపీ గెలిస్తే ఈఎస్ఐ ఆసుపత్రిని తీసుకొస్తామన్నారు. ఒవైసీపీ, కల్వకుంట్ల కుటుంబాలనుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని ఓటర్లను కోరారు కిషన్రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్షమంది ఒవైసీలు అడ్డుకున్నా తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని, బీజేపీ అభ్యర్ధి సీఎం అవతారన్నారు కిషన్ రెడ్డి.