జగన్ చిన్నవాడైనా చేతులెత్తి మొక్కుతున్నానని.. అమరావతిని కొనసాగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా చంద్రబాబు ఇలా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితులు ఏపీకి క్షేమం కాదన్నారు. అమరావతిని దెబ్బతీయడం వల్ల హైదరాబాద్లో పెట్టుబడులు, భూముల ధరలు పెరుగుతున్నాయన్నారు చంద్రబాబు. ఏపీ భవిష్యత్ కోసం, రాబోయే తరాల కోసం తాను చేస్తున్న విజ్ఞప్తి ఇది అన్నారు చంద్రబాబు.