మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రులు చేసిన ఆరోపణలను అంతే ఘాటుగా తిప్పికొట్టారు. బినామీ ఆస్తులను కేంద్రానికి అటాచ్ చేద్దామా అంటూ సూటిగా సవాల్ చేశారాయన. అమరావతిలో ఇల్లు కట్టుకునేందుకు తన కుమారుల పేరుతో భూములు కొన్నానని పయ్యావుల కేశవ్ తెలిపారు. బినామీ ఆస్తులను అటాచ్ చేయాలని కోరితే జగన్ ప్రభుత్వానికి ఉలుకెందుకని నిలదీశారు.