హీరోయిన్ అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి పౌల్ వర్గీస్ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పౌల్ వర్గీస్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అమలాపాల్ తన తండ్రి మృతి చెందారన్న విషయం తెలియగానే హుటాహుటిన కేరళలోని తన స్వస్థలానికి వెళ్ళింది.
కేరళలోని కురుప్పంపాడిలోని సెయింట్ పౌల్ క్యాథలిక్ చర్చిలో ఇవాళ మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పౌల్ వర్గీస్ అంత్యక్రియలు జరిగాయి. ఇక అమలాపాల్ సినిమాల్లోకి రావటం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం ఉండేది కాదని గతంలో రూమర్లు వచ్చాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను ఒప్పించడంతో అమల సినిమాల్లోకి వచ్చారని అమల సన్నిహితులు చెబుతుంటారు.