అమరావతి కోసం పోరును ఉధృతం చేసిన ఎన్నారైలు

Update: 2020-01-22 15:43 GMT

 

అమరావతి కోసం తాము సైతం అంటూ పోరును ఉధృతం చేశారు ఎన్నారైలు. అమరావతినే రాజధాని కొనసాగించాలంటూ నినదిస్తున్నారు. దాదాపు 2 వందల మంది ఎన్నారైలు నాలుగు బస్సుల్లో వెళ్లి.. అమెరికాలోని ఇండియా కాన్సులేట్‌ జనరల్‌ ప్రతినిధిని కలిశారు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగేలా భారత ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ప్రవాసాంధ్రుల విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కాన్సులేట్‌ జనరల్‌ ప్రతినిధి.. అమరావతి విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Similar News