తెలంగాణ ఎన్నికల పలితాల సరళిని మంత్రి కేటీఆర్ తెలుసుకుంటున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఎప్పటికప్పుడు ఫలితాలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. మేయర్, ఛైర్మన్ల ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలు, ఎక్స్ అఫిషియో ఓటు వినియోగంపై చర్చిస్తున్నట్లు సమాచారం.