తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నిలయం రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అతిథులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.