టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసిన విశాఖ వాసులు

Update: 2020-01-29 22:29 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుని పలువురు విశాఖ వాసులు కలిశారు. రాజధాని ముసుగులో వైసీపీ నేతలు విశాఖపై గద్దల్లా వాలారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఆగడాలు తట్టుకోలేమనే భయంతోనే అప్పట్లో విశాఖలో విజయమ్మను ఓడించామని చెప్పారు. ఏటా ఎక్కడో చోట కలిసే తామంతా ఈసారి అమరావతి గ్రామాలకు వచ్చామని.. గత 2 రోజులుగా మందడం, తుళ్లూరు, అనంతవరం, ఉద్దండరాయునిపాలెంలో పర్యటించామని చంద్రబాబుకు తెలిపారు విశాఖ వాసులు.

 

Similar News