ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. చిత్తూరు జిల్లాను తాకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పీలేరులో నలుగురు వ్యక్తులకు కరోనా వైరస్ సోకినట్టు తీవ్రస్తాయిలో ప్రచారం జరుగుతోంది. 2 రోజుల క్రితం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన నలుగురు వ్యక్తులు ఆ తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు రుయా ఆసుపత్రి ఇన్చార్జ్ డాక్టర్ శ్రీహరిరావు.
అధునాతన సౌకర్యాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు.