తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధుల్ని తక్కువ చేసి చూపుతున్నారంటు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు... ఢిల్లీలో కాళ్లు.. గల్లీలో కన్నీళ్లు అన్నట్టు వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. కమీషన్ల కోసం కేంద్రం నిధులు ఇవ్వదని స్పష్టంచేశారు.