ఏపీలో మూడు రాజధానుల బిల్లును, CRDA రద్దు బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో.. వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లు కోరారు ఛైర్మన్ షరీఫ్. ఇప్పటికే టీడీపీ ఐదుగురి పేర్లను పంపగా.. సోమవారం బీజేపీ, పీడీఎఫ్ తమ సభ్యుల పేర్లను పంపాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు బీజేపీ నుంచి మాధవ్, సోము వీర్రాజు.. పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు, వెంకటేశ్వర రావు పేర్లను పంపారు.