ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

Update: 2020-02-05 15:22 GMT

ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోసారి స్పష్టం చేశారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అభీష్టమని తేల్చి చెప్పారు. ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ ధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని జీవీఎల్ ఖండించారు. కేంద్రం ఏదో చేస్తుందనే భ్రమ కల్పించవద్దని సూచించారు. కేంద్రాన్ని బద్నాం చేయడానికే ఇలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

Similar News