సీఎం జగన్ రాయలసీమ ద్రోహిగా అభివర్ణించారు మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తనకంటూ స్పష్టత లేని ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. అత్యంత వెనుకబడిన రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమకు మేలు చేసే ప్రాజెక్టుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.