అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు హరీష్ రావు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. ప్రభుత్వ మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్మినా.. కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామన్నారు.