సిరీస్‌ గెలుచుకున్న కివీస్‌

Update: 2020-02-08 17:58 GMT

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ పరాజయం పాలైంది. దీంతో సిరీస్‌ను కోల్పోయింది. అతిథ్య జట్టు న్యూజిలాండ్ సిరీస్ ను చేజిక్కించుకోవడంతో టీమిండియా అభిమానులు నిరాశకు లోనయ్యారు. శనివారం ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయ్యింది. కాగా మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

Similar News