అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమెరికాలోని తెలుగు NRIలు కదం తొక్కారు. లాస్ ఏంజెల్స్లో భేటీ అయిన NRIలు.. రాజధానిగా అమరావతికి మద్దతు తెలుపుతూ అక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు మెమొరాండం సమర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున NRIలు తరలివచ్చారు.