ఏపీలో అన్యాయంగా పెన్షన్లు తీసేస్తున్నారని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు తొలగిస్తున్నారంటూ.. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆందోళనకు దిగారు. పొన్నూరు MPDO ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు, ధూళిపాళ్లకు మధ్య వాగ్వివాదం జరిగింది.