సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి తెలంగాణను ప్రగతిపథంలో ముందుంచాలని కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ జన్మదినవేడుకల్లో పాల్గొన్నారు మంత్రి ఈటల. 66 కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం.. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో మొక్కలు నాటారు. ఎస్సీ హాస్టల్ విద్యార్ధులకు దోమతెరలు పంపిణీ చేశారు. అనంతరం సర్వమత ప్రార్ధనలు చేశారు.