ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులులు వణికిస్తున్నాయి. కొమ్రం భీం, మంచిర్యాల జిల్లా సరిహద్దుల్లోని గ్రామాల్లో పులి భయం అంతా ఇంతా కాదు. గ్రామాల పరిసరాల్లో పులులు సంచరిస్తూ.. పశువులపై దాడులు చేస్తుండడంతో.. పనులకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పెన్గంగా, ప్రాణహిత నదుల పరీవాహ ప్రాంతం పులుల ఆవాసానికి అనువుగా ఉండడంతో.. వాటి సంచారం పెరిగిపోయింది.