కర్నూలులో హైకోర్టుకు అన్నిపార్టీలు ఒప్పుకున్నాయన్నారు ఉండవల్లి అరుణ్కుమార్. 2006లోనే రాయలసీమలో హైకోర్టు బెంచ్, రాజమండ్రిలోనూ బెంచ్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ నిర్ణయించారన్నారు. ఈ మేరకు అప్పటి లా సెక్రటరీ... హైకోర్టుకు ఓ లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్.. వికేంద్రకరణలో భాగంగా.. కర్నూలులో హైకోర్టు పెడుతున్నందున.. రాజమండ్రిలోనూ బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జగన్కు లేఖ రాసినట్లు తెలిపారు ఉండవల్లి.