9 నెలలలో రాష్ట్రం నాశనం అయిపోయింది: చంద్రబాబు

Update: 2020-02-19 23:33 GMT

9 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైపోయిందన్నారు చంద్రబాబు. ఒకప్పుడు రాష్ట్రం ఎలా ఉంది? ఈ 9 నెలల్లో ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది రద్దుల ప్రభుత్వం.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వమంటూ మండిపడ్డారు. జగన్ పరిపాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం, పిల్లల భవిష్యత్‌ ఏమౌతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి బస్టాండ్‌ వద్ద బహిరంగసభలో పాల్గొన్నారు చంద్రబాబు.

Similar News