జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో.. అమరసైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి చేరుకుని అధికారులకు చెక్ అందచేశారు. సైనిక కుటుంబాలకు తనవంతు సాయం చేశానని, ప్రజలు సైతం.. సైనికులకు అండగా నిలవాలన్నారు పవన్.