67 రోజులుగా రాజధాని కోసం రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో స్పందన లేదని మండిపడ్డారు టీడీపీ నేతలు. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందదని విమర్శించారు. రైతుల త్యాగాలను చిన్న చూపు చూడడం తగదన్నారు. రాజకీయ కక్షతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెంట్గా సిట్ పనిచేస్తుంది తప్ప.. దానిపై నమ్మకం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు.