సీఎం జగన్ కార్యాలయం కేంద్రంగా బీసీ నేతలపై కుట్రలకు తెరలేపారని ఆరోపించారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. తెలుగుదేశం నేతల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుని ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామన్నారు కాల్వ. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయకుండా.. సిట్ వేయడం ఏంటని ప్రశ్నించారాయన. బలవంతపు భూసేకరణపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్ను కలిశారు టీడీపీ నేతలు.