గాంధీ ఆస్పత్రిలో సైన్ ఫ్లూ కలకలం రేపింది. స్వైన్ ఫ్లూ సోకి గర్భిణి మృతి చెందింది. సిజేరియన్ చేసి బిడ్డను డాక్టర్లు రక్షించారు. కరీంనగర్ జిల్లాకు జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్కు చెందిన గర్భిణి శహనాజ్కి స్వైన్ ఫ్లూ సోకడంతో తొలుత వరంగల్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్సిత పొందుతున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో గర్భిణి మృతి చెందారు