కర్నూలు జిల్లాలో బలవంతపు భూసేకరణ.. మహిళ మృతి

Update: 2020-02-25 12:29 GMT

కర్నూలు జిల్లాలో అధికారుల తీరుతో మనోవేదనకు గురై మిడుతూరు మండలం రోళ్లపాడుకి చెందిన మహిళా రైతు రాజమ్మ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల రోడ్డు పక్కన ఉన్న 4 ఎకరాల 20 సెంట్ల భూమిని 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారు. ఈ భూమిలో 3 ఎకరాల 50 సెంట్లను అధికారులు బలంవంతంగా లే అవుట్లు వేశారు. తమకు ఈ పొలం తప్ప మరో జీవనాధారం లేదని వేడుకున్నా.. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించిలేదు.. దీంతో రాజమ్మ మనో వేదనకు గురై గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

 

Similar News