ఇళ్ల స్థలాల పేరుతో .. సాగు భూములు లాక్కుంటున్నారని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూముల్ని అన్యాయంగా దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటోందని ఆవేదన చెందుతున్నారు. 70 ఏళ్లుగా తమకు ఉన్న ఎకరం, అర ఎకరం భూమిని సాగుచేసుకుంటున్న భూముల్ని లాక్కుంటే తమకు చావే దిక్కు అంటున్నారు కందివలస అన్నదాతలు.