హైదరాబాద్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో లక్షలు కాజేసిన వ్యవహరం వెలుగులోకి వచ్చింది. మైక్రోఫైనాన్స్ పేరుతో ఇళ్లు ఇప్పిస్తామంటూ ప్రాసెసింగ్ పేరుతో రూ.18 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ.. ఓ మహిళ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మోసాలకు పాల్పడుతున్న పద్మావతి విష్ణువర్థన్ అనే ఇద్దరిని అదుపులోకితీసుకున్నారు. వీరిపై సీసీఎస్తో పాటు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.