విశాఖ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. సాధారణంగా తనిఖీలు చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి సోదా చేసిన అధికారులు షాక్ తిన్నారు. వారి దగ్గర నుంచి 51.5 లక్షల విలువైన 10 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి భారత్కు వస్తున్న నూరుల్ హుడా, రఫకాత్ అలీ అనే ఇద్దరి ప్రయాణికులను అరెస్ట్ చేశారు..