విశాఖ ఎయిర్పోర్టులో చంద్రబాబును అడ్డుకున్న ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. నేరాలు చేసే వారికి, నేరాలు చేసే ఆలోచన ఉన్నవారికి మాత్రమే ఇచ్చే 151 CRPC నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అటు శనివారం గవర్నర్ను కూడా కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు టీడీపీ నేతలు. త్వరలోనే విశాఖలో పర్యటిస్తానని..ఎన్నిసార్లు అడ్డుకుంటారో చూస్తానని అన్నారు చంద్రబాబు.