తెలంగాణ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్లాలన్నదానిపై టీకాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గాంధీభవన్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు.. టీపీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వ్యవసాయ, రైతు అంశాలపై చర్చిస్తున్నారు.