ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీని తలపించేలా పాలన : ఎమ్మెల్సీ బుద్ధా

Update: 2020-03-01 14:32 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీని తలపించేలా పరిపాలన నడుస్తోందని ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వర్‌రావు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. వైజాగ్‌ ప్రజలు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను కోరుకోవడం లేదని అన్నారాయన. విశాఖలోని పరిశ్రమల్ని తరిమేసి, సచివాలయం పెడితే ఏ లాభమని నాగ జగదీశ్వర్‌రావు సూటిగా ప్రశ్నించారు.

Similar News