రంగారెడ్డి జిల్లాలో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారీ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. కొత్తూరు మండలం, తిమ్మాపూర్ పంచాయతీలోని రైల్వే సమీపంలోని హరి ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో కొందరు వ్యాపారులు ఈ కల్తీ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు.. జంతు కళేబరాలను, చనిపోయిన పందులు వాటి కళేబరాలతో కల్తీ నూనె, మొక్కలతో దాన తయారు చేస్తున్నారు.. అక్కడి నుంచి వస్తున్న దుర్వాసనతో స్థానికులు పరిశ్రమలోకి వెళ్లి చూస్తే బండారం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు.