లోక్సభ దివంగత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి
లోక్సభ దివంగత స్పీకర్ GMC బాలయోగి అందరికీ ఆమోదయోగ్యుడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లోక్సభ స్పీకర్గా బాలయోగి చేసిన సేవల్ని చంద్రబాబు కొనియాడారు. స్పీకర్గా బాలయోగి వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేశారని.. బాబు కితాబిచ్చారు. బాలయోగి లాంటి నేతలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు చంద్రబాబు.