ఏపీ సర్కార్ తీరుపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. పోలీసులతో ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూసినా.. తాము అంతకంటే మొండిగా ముందుకెళ్తామంటున్నారు. శాంతియుతంగా సాగుతున్న తమ పోరాటాన్ని మరింత రెచ్చగొట్టేలా చూస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తన్నట్టు ప్రకటించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు.