కరోనా గురించి అంతలా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు హోమియో వైద్యులు. కరోనా కోసం అర్సనిక్ 30 హోమియోపతి ముందులు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు అడిషనల్ డైరెక్టర్ లింగరాజు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే దానిని అర్సనిక్ 30 కంట్రోల్ చేస్తుందన్నారు. కరోనా లక్షణాలు ఉన్నా.. అర్సనిక్ 30 దివ్య ఔషదంలా పని చేస్తుందన్నారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకే దీనిని ఇస్తున్నామన్నారు. దీన్ని వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవన్నారు. అన్ని వర్గాల ప్రజలు అర్సనిక్ 30 మందు వేసుకోవచ్చని అడిషనల్ డైరెక్టర్ లింగ రాజు అన్నారు.