తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ ప్రజా చైతన్య యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. క్వారీ సెంటర్ నుంచి కాతేరు మీదుగా బొబ్బిలంక చేరుకున్నారు నారా లోకేష్.
రాజానగరం మునికూడలి వద్దకు రాగానే వైసీపీ నేతలు రెచ్చిపోయారు. లోకేష్ పర్యటనను అడ్డుకునేందకు యత్నించారు. టీడీపీ నేతలపై కుర్చీలు విసిరారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.