ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి కూడ ప్రవేశించింది. ఈ వైరస్ను సమర్ధవంతంగా నివారించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఐసోలేటెడ్ వార్డులను వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఏర్పాటు చేయడాన్ని అక్కడి స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం ఉన్నందున ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.