పౌరసత్వ సవరణ చట్టంపై శాసన సభలో చర్చ జరగాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. సీఏఏపై రెండు మూడు గంటలైనా చర్చిద్దామని తెలిపారు. సీఏఏపై తాము ఇప్పటికే పార్లమెంట్లో వ్యతిరేకించామని చెప్పిన కేసీఆర్.. దేశ వ్యాప్తంగా ఐదారు అసెంబ్లీల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని గుర్తు చేశారు. అటు కేంద్రం నుంచి జీఎస్టీ బకాయిలు కూడా రావడం లేదన్నారు సీఎం కేసీఆర్.