గెలిపిస్తే.. విశాఖ కార్పొరేషన్‌కు పూర్వవైభవం తీసుకొని వస్తాం: ఎమ్మెల్సీ మాధవ్

Update: 2020-03-10 13:21 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి పరిమితం కాకుండా.. ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేయాలని బీజేపీ-జనసేనలు నిర్ణయించాయి. విశాఖలో రెండు పార్టీలు సుదీర్ఘంగా ఉమ్మడి సమావేశం నిర్ణయించి పలుకీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య సర్దుబాటు వచ్చింది.

ఏపీలో బీజేపీ-జనసేన కూటమి బలమైన శక్తిగా ఎదిగింది అన్నారు ఎమ్మెల్సీ మాధవ్‌. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కూటమి అన్ని చోట్ల పోటీ చేస్తుందని.. టీడీపీకి అన్ని చోట్ల అభ్యర్థులు దొరికే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి పట్టం కడితే విశాఖ కార్పొరేషన్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని మాధవ్‌ హామీ ఇచ్చారు.

చారిత్రక అవసరం దృష్ట్యా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామన్నారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌. తమది సమాజ హితం కోసం పెట్టుకున్న పొత్తు అని వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

Similar News