పాకిస్థాన్ లో యుద్ధవిమానం కూలిపోయింది. పాకిస్థాన్ వైపమానిక దళానికి చెందిన ఎఫ్- వ16 యుధ్ద విమానం ఇస్లామాబాద్ సమీపంలోని ఓ పార్కు వద్ద ప్రమాదానికి గురైంది. గణతంత్ర దినోత్సవాల కోసం జరుగుతున్న రిహార్షల్స్ ఈ సంఘటన జరిగిందని పాక్ వైమానిక దళం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 23న పాక్ లో గణతంత్ర దినోత్సవాలు జరుగుతాయి. విమానం కూలిన వెంటనే.. పోలీసులు, భద్రతా బలగాలు సంఘటన స్థలాన్ని చేరుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థను ఆదేశిస్తామని వైమానిక దళం ప్రకటించింది.