తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పైలట్ అవతారం ఎత్తారు. అంతేకాదు 10 నిముషాల సేపు విమానాన్ని నడిపి సరికొత్త అనుభూతిని పొందారు. శంషాబాద్ విమానాశ్రయంలో పైలట్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన స్వయంగా విమానాన్ని నడిపారు. హైదరాబాద్ ఏవియేషన్ హబ్గా మారుతున్న తరుణంలో శంషాబాద్ విమానాశ్రయం వద్ద పైలట్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పడం అభినందనీయమన్నారు. FSTC కి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరమైనా అందిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.